హైదరాబాద్: 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సికింద్రాబాద్లోని 1 తెలంగాణ బాలికల బీఎన్ ఎన్సీసీ క్యాడెట్లు, సిబ్బంది ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. కోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం హెరిటేజ్ భవనాల పచ్చిక బయళ్ల మధ్య ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. లెఫ్టినెంట్ కల్నల్ సంగీతా కుమారి నేతృత్వంలోని 1 తెలంగాణ బాలికల బీఎన్ ఎన్సీసీకి చెందిన 550 మంది క్యాడెట్లు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ‘‘నమస్తే ఇండియా ఫౌండేషన్’’ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, తెలంగాణ యూత్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బ్ర్రిజ్ భూషణ్ పురోహిత్ సమన్వయం చేసారు. ప్రామాణిక యోగా ప్రోటోకాల్ ద్వారా క్యాడెట్లకు పురోహిత్ మార్గనిర్దేశం చేశారు, యోగా సాధన ద్వారా మనస్సు, శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిందిగా క్యాడెట్లను కోరారు.