గురుగ్రామ్: భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్సంగ్ తాజాగా భారతదేశంలో తన మ్యూజిక్ ఫ్రేమ్ను ఆవిష్కరించింది. వైర్లెస్ స్పీకర్ ఒక కళాఖండం వలె కనిపిస్తుంది. ఈ మ్యూజిక్ ఫ్రేమ్ డాల్బీ అట్మోస్, వైర్లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్ వంటి కొత్త ఫీచర్లతో కేవలం రూ.23,990కు లభిస్తుంది. స్టైలిష్ వైర్లెస్ స్పీకర్ను పిక్చర్ ఫ్రేమ్గా చేయడం ద్వారా మునుపెన్నడూ లేని విధంగా లివింగ్ రూమ్లో చక్కగా సరిపోతుంది. నిజమైన ఫ్రేమ్ వలె శామ్సంగ్ మ్యూజిక్ ఫ్రేమ్, వినియోగదారులు వారి ఫోటోలను పెట్టుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. విలువైన జ్ఞాపకం లేదా కళాఖండం ఫ్రేమ్డ్ ఫోటోను చూస్తూ సంగీతాన్ని వినడం వినియోగదారుల అనుభవాలకు కొత్త స్థాయిలను జోడిస్తుంది. శామ్సంగ్ మ్యూజిక్ ఫ్రేమ్ ఈరోజు నుండి శామ్సంగ్.ఇన్, అమెజాన్.ఇన్, ఎంపిక చేసిన ఆఫ్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.