ముంబయి: భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారులలో ఒకటైన ఏథర్ ఎనర్జీ, గత కొన్ని వారాలుగా దాని రాబోయే ఫ్యామిలీ స్కూటర్ రిజ్టా గురించి అందరినీ ఊరిస్తోంది. ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్లో, తరుణ్ మెహతా, రిజ్టా సీటును ఈ సెగ్మెంట్ లోని రెండు ప్రముఖ స్కూటర్లతో పోల్చిన రెండు చిత్రాలను పంచుకున్నారు. వాటిని పోల్చి చూసినప్పుడు రిజ్టా సీటు, చాలా పెద్దదిగా ఉంది, ఇది ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్లో రిజ్టా అతిపెద్ద సీటును కలిగి ఉంటుందని సూచిస్తోంది. సోషల్ మీడియాలో చాలా మంది దృష్టిని ఆకర్షించిన తన ఇటీవలి ట్వీట్లలో, అథర్ సీఈఓ తరుణ్ మెహతా, రిజ్టా సీటు పరిమాణం వెల్లడిరచారు. ఏథర్ ఎనర్జీని ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు, కానీ మా నుండి పెద్ద స్కూటర్ను కోరుకున్నారు. కాబట్టి మేము మా ఫ్యామిలీ స్కూటర్ని డిజైన్ చేస్తున్నప్పుడు, మేము ఈ అంశంపై దృష్టి సారిచాము. నేను ‘‘పెద్దది’’ అంటే ఏమిటో మీ అందరికీ స్నీక్ పీక్ ఇవ్వాలనుకుంటున్నాను. మార్కెట్లో ఇదే అతిపెద్ద సీటు! మా కమ్యూనిటీ డే 2024 రియల్ త్వరలో ప్రారంభించబడుతోంది! అని తెలిపారు.