హైదరాబాద్: వైద్య సాంకేతికత లో అంతర్జాతీయంగా అగ్రగామి సంస్థ అయిన మెడ్ట్రానిక్ హైదరాబాద్లో తాము నూతనంగా విస్తరించిన, అత్యాధునిక మెడ్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎంఈఐసి)ని ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, మెడ్ట్రానిక్ చైర్మన్, సీఈఓ, జెఫ్ మార్తాలు, గౌరవ అతిథి యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ సమక్షంలో ప్రారంభించారు. ఈ ఆర్ అండ్ డి కేంద్రం విస్తరణ మెడ్ట్రానిక్ లక్ష్యమైన వ్యూహాత్మకంగా దాని గ్లోబల్ ఆర్ అండ్ డి కార్యకలాపాలను విస్తరించడం, స్థానిక ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడి పెట్టడంకు అనుగుణంగా ఉంటుంది. ఆర్ అండ్ డి సౌకర్యాన్ని పెంచడానికి, విస్తరించడానికి మరియు భవిష్యత్తులో 1500 మందికి ఉపాధి కల్పించడానికి మెడ్ట్రానిక్ ఐదు సంవత్సరాల కాలంలో ప్రకటించిన సుమారు రూ. 3000 కోట్ల పెట్టుబడిలో ఈ విస్తరణ భాగం.