హైదరాబాద్/విజయవాడ: గ్రాడ్యుయేషన్, ఉన్నత విద్య కోసం దేశంలో అగ్రగామి యూనివర్శిటీలలో ఒకటైన కెఎల్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ, ఈ విద్యా సంవత్సరం కోసం తమ నమోదిత విద్యార్థులకు 100% క్యాంపస్ ప్లేస్మెంట్లు జరిగాయని వెల్లడిరచింది. ఈ మల్టీ డిసిప్లీనరీ యూనివర్శిటీ 4600కు పైగా ఉద్యోగ ఆఫర్లు అందుకోవడంతో పాటుగా గత సంవత్సరంతో పోలిస్తే ఆఫర్ల సంఖ్య పరంగా 42% వృద్ధిని నమోదు చేసింది. ఈ ప్లేస్మెంట్ సీజన్ను అత్యున్నత స్ఫూర్తితో ప్రారంభించిన యూనివర్శిటీ, ఇటీవలనే ఈ ప్లేస్మెంట్ సీజన్ను ముగించడంతో పాటుగా జాతీయ, అంతర్జాతీయ రిక్రూటర్ల నుంచి అద్భుతమైన ఆసక్తిని పొందింది. ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్మెంట్స్ పరంగా నూతన మైలురాయిని ఈ యూనివర్శిటీ అందుకుంది. అత్యధికంగా ఓ విద్యార్థికి 55 లక్షల రూపాయల ప్యాకేజీని ఓ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ అందించింది. సరాసరి శాలరీ ప్యాకేజీ సైతం గణనీయంగా వృద్ధి చెందింది.