ముంబయి: భారతదేశంవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) కోసం పబ్లిక్ ఛార్జింగ్ మౌలికసదుపాయం పెంచడానికి షెల్ ఇండియా మార్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఐఎంపీఎల్)తో జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఒక వ్యూహాత్మకమైన సహకారాన్ని ప్రకటించింది. గొప్ప వాహనం ఛార్జింగ్ అనుభవం కోసం దేశంలో షెల్ వారి విస్తృతమైన స్టేషన్ నెట్వర్క్ ప్రయోజనాన్ని జేఎస్ డబ్ల్యూ మోటార్ ఇండియా కస్టమర్స్ పొందగలరు. అవగాహన ఒప్పందం ప్రకారం, షెల్ ఇండియా సీసీఎస్ 50కేడబ్ల్యూ, 60 కేడబ్ల్యూ డీసీఫాస్ట్ ఛార్జర్స్ను పూర్తి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుంది. ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్కు మద్దతునిస్తుంది. ఈవీ యూజర్స్ కోసం దూర ప్రయాణాలను సమన్వయం చేస్తుంది. ఈ ఛార్జర్స్ ఎంజీ కస్టమర్స్కు మైఎంజీ యాప్, షెల్ వారి నెట్వర్క్ డిస్కవరీ టూల్ ద్వారా అందుపాటులో ఉండి, సౌకర్యానికి, వినియోగించడాన్ని సులభం చేయడాన్ని నిర్థారిస్తాయి. గౌరవ్ గుప్తా, ఛీఫ్ గ్రోత్ ఆఫీసర్, జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మాట్లాడుతూ, భారతదేశపు రెండవ అతిపెద్ద ఈవీ తయారీదారుగా, మా కస్టమర్స్ కోసం ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) యాజమాన్యం అనుభవం మెరుగుపరిచే లక్ష్యాన్ని కలిగి ఉన్నామని తెలిపారు.