హైదరాబాద్: దేశీయంగా అత్యంత విశ్వసనీయ ప్రైవేట్ బీమా సంస్థల్లో ఒకటైన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తమ వినియోగదారులకు బీమా సేవలను అందుబాటులోకి తేవడంపై మరింతగా దృష్టి పెట్టడాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ హైదరాబాద్లోని యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్త శాఖ కార్యాలయాన్ని ప్రారంభించింది. దీని చిరునామా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, డోర్.నెం.3-330/1/సీ/ఏ/1, మొదటి అంతస్తు, డీజే కాంప్లెక్స్, గణేష్ నగర్, చౌటుప్పల్ మెయిన్ రోడ్, మల్లికార్జున స్కూల్ ఎదురుగా, చౌటుప్పల్ టౌన్`మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, హైదరాబాద్, 508252. ఈ వ్యూహాత్మక విస్తరణతో రాష్ట్రంలో జీవిత బీమా విస్తృతికి మరింతగా దోహదపడాలని కంపెనీ నిర్దేశించుకుంది. హైదరాబాద్లో కొత్త శాఖ కార్యాలయాన్ని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రీజనల్ డైరెక్టర్ (హైదరాబాద్ రీజియన్) అభిషేక్ మజుందార్ ప్రారంభించారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రీజనల్ మేనేజర్ (రిటైల్ ఏజెన్సీ) పి.వంశీధర్ రెడ్డి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యుటీ రీజనల్ మేనేజర్ (హైదరాబాద్ మెట్రో) పి.శ్యామ్సుందర్ రాజు, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రీజనల్ మేనేజర్ (ఐఏ ఛానెల్) వినీత్ శుక్లా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రీజనల్ హెచ్ఆర్ ఎస్.ఫ్రెడ్లిన్తో పాటు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.