న్యూఢల్లీ : వినూత్న గ్లోబల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన వై సిరీస్ పోర్ట్ ఫోలియోను వై28ఎస్, వై28ఈలను భారత్ లో లాంచ్ చేసింది. సెన్సిబిలిటీతో కూడిన శైలిని తీసుకువచ్చే ఈ రెండు స్మార్ట్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 6100G 5జీ ప్రాసెసర్, శక్తివంతమైన 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అద్భుతమైన డిజైన్ను కలిగి ఉన్నాయి. వివో వై28ఎస్ ధర 4జీబీG128జీబీ వేరియంట్కు రూ.13,999, 6జీబీG128జీబీ వేరియంట్కు రూ.15,499, 8జీబీG128జీబీ వేరియంట్కు రూ.16,999, వివో వై28ఈ ధర 4జీబీG64జీబీ వేరియంట్కు రూ.10,999, 4జీబీG128జీబీ వేరియంట్కు రూ.11,999. స్మార్ట్ఫోన్లు ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, ఈరోజు నుండి అన్ని పార్టనర్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.