గురుగ్రామ్: వినియోగదారులు ఇప్పుడు తమ తదుపరి గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను ముందస్తుగా రిజర్వ్ చేసుకోవడం ద్వారా ముందస్తు యాక్సెస్, ప్రత్యేక ఆఫర్లను పొందేందుకు అర్హత పొందవచ్చని భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ తెలిపింది. శామ్సంగ్.కామ్, శాంసంగ్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్, అమెజాన్.ఇన్, ఫ్లిప్కార్ట్.కామ్, భారతదేశం అంతటా ఉన్న ప్రముఖ రిటైల్ అవుట్లెట్లలో రూ. 2000 మొత్తాన్ని చెల్లించడం ద్వారా కస్టమర్లు తమ తదుపరి గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను ముందస్తు రిజర్వ్ చేసుకోవచ్చు. గెలాక్సీ జెడ్ సిరీస్ స్మార్ట్ఫోన్లను ముందస్తుగా రిజర్వ్ చేసుకున్న వినియోగదారులు ఈ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే రూ. 7000 వరకు విలువైన ప్రయోజనాలను పొందుతారు. జూలై 10న జరిగే గ్లోబల్ ఈవెంట్లో తదుపరి తరం గెలాక్సీ జెడ్ సిరీస్ స్మార్ట్ఫోన్లు మరియు దాని సంబంధిత ఉపకరాలను విడుదల చేయనున్నట్లు శాంసంగ్ ఇటీవల ప్రకటించింది. గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ పారిస్లో జరుగనుంది.