హైదరాబాద్ : హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మకమైన ఆభరణాల సంస్థ శివ్ నారాయణ్ జ్యువెలర్స్ను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ‘ఎక్స్లెన్స్ ఇన్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్’ అవార్డుతో సత్కరించింది. శివ్ నారాయణ్ జ్యువెలర్స్ ప్రదర్శించిన అసాధారణమైన హస్తకళ, సృజనాత్మక నైపుణ్యాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని మంత్రి కె.టి. రామారావు అందజేశారు. మూడు సంవత్సరాల క్రితం, శివ్ నారాయణ్ జ్యువెలర్స్ ప్రపంచాన్ని ఆకర్షించే నాలుగు దిగ్గజ కళాఖండాలను రూపొందించడానికి అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆధునిక సాంకేతికత, పురాతన పద్ధతుల ఖచ్చితమైన సమ్మేళనంతో చక్కగా రూపొందిన ఈ అసాధారణమైన క్రియేషన్స్లో గణేష్ లాకెట్టు, రామ్ దర్బార్ లాకెట్టు, ది సట్లడ (ఏడు-పొర) నెక్లెస్, భూతద్దం ఉన్నాయి. అవి ఈ రంగంలో నూతన ప్రమాణాలను నెలకొల్పినట్లు శివ్ నారాయణ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ అగర్వాల్ అన్నారు.