హైదరాబాద్: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఈఈ) మెయిన్ 2024 మొదటి సెషన్లో 100 పర్సంటైల్ను హైదరాబాద్కు చెందిన విద్యార్థి రిషి శేఖర్ శుక్లా సాధించినట్లు ఆకాష్ బైజూస్ సగర్వంగా వెల్లడిరచింది. అతను సాధించిన ఈ విజయం అతన్ని జాతీయంగా, తెలంగాణ రాష్ట్రంలో ఇన్స్టిట్యూట్ పరంగా అత్యధిక స్కోరర్గా నిలబెట్టడమే కాకుండా భారతదేశంలోని అత్యంత కఠినమైన పోటీ పరీక్షలలో ఒకటైన జెఈఈలో టాప్ స్కోరర్గా నిలవటంలో అతని తిరుగులేని నిబద్ధత, విద్యా నైపుణ్యాన్ని కూడా నొక్కి చెబుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ సంవత్సరం ఇంజినీరింగ్ కోసం షెడ్యూల్ చేయబడిన రెండు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లలో మొదటి దాని ఫలితాలు వెల్లడిరచింది. ఐఐటి జెఈఈని జయించాలనే ఆకాంక్షతో ఆకాష్ బైజూస్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో నమోదు చేసుకున్న రిషి శేఖర్ శుక్లా ఫండమెంటల్ కాన్సెప్ట్లను అర్థం చేసుకోవడంలో అంకితభావంతో టాప్ పర్సంటైల్స్కు చేరుకున్నట్లు పేర్కొన్నాడు.