ముంబయి: ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) మరియు ఒప్పో ఇండియా నేడు తమ ‘జనరేషన్ గ్రీన్’ క్యాంపెయిన్ను ప్రకటించాయి. ఇది 100-రోజుల కార్యక్రమం-1ఎం1బీ (వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్) ద్వారా నిర్వహిస్తుండగా, భారతదేశంలోని కళాశాలల్లో 5,000 ఇంటర్న్షిప్ అవకాశాల ద్వారా యువతలో గ్రీన్ నైపుణ్యాలను ప్రోత్సహిస్తుంది. లింక్డ్ఇన్ గ్లోబల్ గ్రీన్ స్కిల్స్ రిపోర్ట్ 2023 ప్రకారం, గ్రీన్ స్కిల్స్ ఉన్న ఉద్యోగార్ధులు సగటు వర్క్ఫోర్స్ కన్నా 29% ఎక్కువ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఈ ప్రయత్నం వాతావరణ- స్పృహతో కూడిన నైపుణ్యాలను పెంపొందిస్తుంది. ఇది విద్యార్థుల జ్ఞానాన్ని రేపటి అవకాశాల కోసం భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా చేస్తుంది. గ్రీన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కోసం ఒప్పో ఇండియాతో ఏఐసీటీఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం పట్ల గర్వంగా ఉందని ఏఐసీటీఈ ఛైర్మన్ డాక్టర్ టీజీ సీతారాం హర్షాన్ని వ్యక్తం చేశారు.