ముంబయి: బీఎండబ్ల్యు గ్రూప్ ఇండియా తన మ్యూజిక్ అండ్ డ్రైవింగ్ ఫెస్టివల్-జాయ్టౌన్ రెండవ ఎడిషన్ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ముంబయిలోని బ్రాండ్ అభిమానులను మరియు ఔత్సాహికులకు రెండు రోజుల పాటు లీనమయ్యే బ్రాండ్ అనుభవ ఉత్సవాన్ని 12-13 ఏప్రిల్ 2024న ముంబయిలోని మహాలక్ష్మి రేస్కోర్స్లో నిర్వహించనున్నారు. జాయ్టౌన్లో భాగంగా బీఎండబ్ల్యు, మినీ, బీఎండబ్ల్యు మోటోరాడ్ కార్లు, బైక్లు, సంగీతం, వినోదం, గాస్ట్రోనమికల్ డిలైట్ల కచ్చితమైన మిక్స్గా ఒక వినూత్నమైన అనుభవాన్ని అందిస్తుంది. ఎక్స్పర్ట్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా రూపొందించిన ట్రాక్లో డ్రైవ్ ఎక్స్ డ్రైవ్ శక్తి, చురుకుదనం, పరాక్రమాల ప్రదర్శనకు సాక్ష్యంగా నిలుస్తుందని బీఎండబ్ల్యు గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాప్ా తెలిపారు.