న్యూఢల్లీి: భారతదేశంలోని ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్లలో టాప్7 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)
గౌహతి, ప్రపంచంలోని ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్లలో ఒకటైన బ్యాచ్లర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ (ఆనర్స్) ప్రోగ్రామ్ ఇన్ డేటాసైన్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆన్ కోర్సెరా ప్లాట్ఫారమ్ను ప్రారంభిస్తోంది. ఈ ఆన్లైన్ డిగ్రీ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యార్థులకు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉపాధి అవకాశాల కోసం దీన్ని సిద్ధం చేస్తుంది. ఆయా ఉద్యోగాలు, పరిశ్రమలలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నైపుణ్యాలు కీలకంగా మారాయి. జాతీయ విద్యా విధానం-2020 యువతకు ఉపాధిని మెరుగుపరచేందుకు, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనాలిసిస్ మొదలైన అత్యాధునిక రంగాలలో నిపుణుల ద్వారా శిక్షణ ఇవ్వడం, వారిని సిద్ధం చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ డిమాండ్ను తీర్చేందుకు, జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సులను అమలు చేసేందుకు ఐఐటి గౌహతి బహుళ ప్రవేశ మార్గాల ద్వారా పూర్తిగా ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్కు అందుబాటును కల్పిస్తోంది.