హైదరాబాద్ : గుర్గావ్లోని హయాత్ రెజెన్సీలో జరిగిన ప్రతిష్టాత్మక గ్లోబల్ సిఎస్ఆర్ అండ్ ఈఎస్జి అవార్డ్స్ 2024లో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థకు టాప్ 10 బెస్ట్ ఎన్జిఓస్ ఆఫ్ ది ఇయర్-2024 పురస్కారం పొందింది. ఇందులో పలుకుబడి గల ప్రముఖులు సమావేశమయ్యారు. ఎల్విపిఇఐ తరఫున పబ్లిక్ రిలేషన్స్ మరియు డోనర్ ఎఫైర్స్ బృందంలోని మహావీర్ సి జైన్ పురస్కారాన్ని స్వీకరించారు. పురస్కారాన్ని స్వీకరించడంపై స్పందిస్తూ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షులు డా ప్రశాంత్ గర్గ్ ‘‘సిబ్బంది అందరి అవిరామ అంకితభావం, మా దాతలు మరియు భాగస్వాముల అచంచల మద్దతుకు పురస్కారం ఒక నిదర్శనం. ఇటువంటి పురస్కారాలు అందరూ చూడగలగాలి అనే మా కృషిని కొనసాగించడానికి ప్రేరణనిస్తాయి’’ అన్నారు.