ముంబయి: భారతదేశంలో సముదాయ సంక్షేమానికి ఒక దశాబ్దం పాటు ఆవిష్కరణలను, సహకారాన్ని అందించిన సందర్భంలో, ప్రపంచ సాంకేతిక నాయకునిగా కొనసాగుతున్న షవోమీ ఇండియా, క్రికెటర్, క్యాన్సర్ నుంచి బయటపడిన యువరాజ్ సింగ్ నెలకొల్పిన లాభాపేక్షలేని సంస్థ యువరాజ్ సింగ్ ఫౌండేషన్తో సరికొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ‘స్వస్త్ మహిళా స్వస్త్ భారత్’ ప్రాజెక్ట్లో భాగంగా 15 రాష్ట్రాలలో 12 నెలల పాటు 1,50,000 మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ను పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తక్కువ ప్రాతినిధ్యం, తక్కువ వనరులు ఉన్న సంఘాలపై ఈ ప్రాజెక్టు దృష్టి సారించింది. షవోమీ ఇండియా అధ్యక్షుడు మురళీకృష్ణన్ బి మాట్లాడుతూ, రొమ్ము క్యాన్సర్ను ఎదుర్కొనడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. యువరాజ్ సింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో రొమ్ము క్యాన్సర్పై మా పోరాటంలో ‘స్వస్త్ మహిళా స్వస్త్ భారత్’ ప్రచారం కీలకమైన దశ అని అన్నారు.