న్యూదిల్లీ: భారతదేశంలోని ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ దేశంలో ఆవిష్కరణ వాతావరణం ప్రోత్సహించడానికి రూపొందించిన తన ప్రతిష్టాత్మక సీఎస్ఆర్ కార్యక్రమం ‘సాల్వ్ ఫర్ టుమారో’ కోసం 100 టీమ్లను షార్ట్లిస్ట్ చేసినట్లు వెల్లడిరచింది. ఈ షార్ట్లిస్ట్లో ‘స్కూల్’, ‘యూత్’ ట్రాక్ నుండి ఒక్కొ చోట 50 జట్లు ఉన్నాయి, వీరు ఇప్పుడు జాతీయ విద్య, ఆవిష్కరణల పోటీలో మరింతగా పోటీ పడతారు. ఈ సంవత్సరం, ఎంపికలు ప్రాంతీయంగా చేయబడ్డాయి, ఇది ఒడిశాలోని ఖుర్దా కచర్లోని ఖుర్దా మరియు అస్సాంలోని కమ్రుప్ రూరల్, గుజరాత్లోని అమ్రేలీ వంటి దేశంలోని మారుమూల పట్టణాలలో నివసిస్తున్న తరువాతి తరం భారతీయ ఆవిష్కర్తలకు చేరువ కావడానికి ఈ పోటీ సహాయపడిరది. యూత్ ట్రాక్లో ‘పర్యావరణం, సస్టైనబిలిటీ‘ థీమ్ను కవర్ చేస్తూ సమర్పించిన టాప్ 50 ఆలోచనలు సాంప్రదాయేతరమైనవి మాత్రమే కాకుండా భవిష్యత్తు-కేంద్రీకృతమైనవి.