హైదరాబాద్: పిల్లలకు ప్రత్యేక సంరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, పీడియాట్రిక్ ఎపిలెప్సీ సెంటర్ స్థాపన, క్రెష్ సౌకర్యాల పునరుద్ధరణ లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కు ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ రూ..2.1 కోట్ల విరాళం అందజేసింది. రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ (రోటరీ డిస్ట్రిక్ట్ 3150, ఇండియా), ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) సహకారంతో హైదరాబాద్లోని ఐటీసీ కోహెనూర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మొత్తాన్ని అందజేశారు.