గురుగ్రామ్: హ్యుందాయÊ మోటార్ ఇండియా లిమిటెడ్ 2025 నాటికి ఆర్ఈ 100 బెంచ్మార్క్ను సాధించాలనే లక్ష్యంతో సుస్థిరత పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. కంపెనీ ప్రస్తుతం దాని ఇంధన అవసరాల్లో 64% పునరుత్పాదక వనరులను ఉపయోగించి పూర్తిచేస్తుంది. 100కి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని చాలా ఆటోమేకర్ల కంటేఇది ముందుంది. ఆర్ఈ 100 అనేది క్లైమేట్ గ్రూప్ ద్వారా గ్లోబల్ కార్పొరేట్ పునరుత్పాదక శక్తి చొరవ, 100% పునరుత్పాదక విద్యుత్కు కట్టుబడి ఉన్న వందలాది పెద్ద, ప్రతిష్టాత్మక వ్యాపారాను ఒకచోట చేర్చింది. హ్యుందాయÊ చీఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీసర్ గోపాల కృష్ణన్ మాట్లాడుతూ, తమ కార్యకలాపాలు పర్యావరణ, సమాజాల పట్ల బలమైన బాధ్యతతో నడపబడుతున్నాయని తెలిపారు.