విశాలాంధ్ర – ధర్మవరం;; పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభకు కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందనలను తెలియజేయడం జరిగిందని ప్రిన్సిపాల్ కారణం హర్షవర్ధన్ తెలిపారు.విజేతలకు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ బహుమతి ప్రధానం
నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ధర్మవరం శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు నాగవల్లి, అమృతసాయి, డ్రాయింగ్ పోటీలలో భావన, జయలక్ష్మి ప్రథమ , ద్వితీయ స్థానాలను సాధించి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చేతుల మీదుగా మెమెంటో మరియు ధృవ పత్రాలను అందుకున్నారు అని తెలిపారు. తమ విద్యార్థులు చదువుతో పాటుగా అన్ని రంగాలలోనూ రాణిస్తుండటం వారి ప్రతిభకు అద్దం పడుతున్నది అని, విద్యార్థులకు ప్రతి విషయంలోనూ తమ కళాశాల సహకారం ఎల్లవేళలా అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు బహుమతి సాధించిన విద్యార్థులకు కళాశాలలో అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి రమేష్, అకడమిక్ ఇంచార్జి కృష్ణయ్య, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులకు కలెక్టర్, ఎస్పీ అభినందనలు
- Advertisement -
RELATED ARTICLES


