విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సీఐగా గడ్డం మల్లేష్ బాధ్యతలు స్వీకరించారు.ఇదివరకు జీడిమెట్ల సిఐగా విధులు నిర్వర్తించిన శ్రీనివాసరావు సైబర్ క్రైమ్ సిఐగా బదిలీ అయ్యారు.మాదాపూర్ సిఐగా పనిచేస్తున్న గడ్డం మల్లేష్ ను జీడిమెట్ల ఎస్ఎచ్ ఓ గా బదిలీ చేస్తూ సైబర్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా సిఐ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు, స్థానిక ప్రజానీకం పూర్తి సహకారం అందించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు,ఇతరత్ర ప్రజలకు హాని చేకూర్చే పనులకు పునుకుంటే సహించబోమని ఆయన అన్నారు.అక్రమాలకు పాల్పడుతూ,శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమాని కఠిన చర్యల తప్పవని హెచ్చరించారు.