ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో పాటు ఆయన పార్టీ సీనియర్లకు తోషాఖానా అవినీతికి సంబంధించిన నిరసనల కేసులో ఊరట లభించింది. ఎన్నికల కమిషన్ ఇమ్రాన్ ఖాన్పై వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన నిరసన నేపథ్య కేసులో ఇమ్రాన్ ఖాన్ నిర్దోషి అంటూ కోర్టు తీర్పు వెలువడిరది. అలాగే షా మెహమూద్ ఖురేషి, షేక్ రషీద్, అసద్ కైజర్, షెప్ారియర్ ఆఫ్రిది, ఫైజల్ జావేద్, రాజా ఖుర్రమ్ నవాజ్, అలీ నవాజ్ అవాన్ కూడా నిర్దోషులని జుడిషియల్ మెజిస్ట్రేట్ యాసిర్ మెహమూద్ పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని దాఖలైన పిటిషన్లపై తీర్పును న్యాయమూర్తి గత వారంలో రిజర్వులో పెట్టారు. ఆయన బుధవారం ఇమ్రాన్కు ఊరట కల్పిస్తూ తీర్పు వెలువరించారు.
బుష్రా బీబీకి మధ్యంతర బెయిల్
ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి అవినీతి కేసులో మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ మేరకు రావల్పిండిలోని ప్రత్యేక అకౌంటబిలిటీ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అక్రమ లావాదేవీల్లో ఇమ్రాన్కు సహకరించినట్లు బుష్రాపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.