వరుసగా మూడోసారి గెలిచిన
కేకేఈ విద్యార్థి సంఘం
ఏథెన్స్: గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) యువజన శాఖ కేఎన్ఈ మద్దతున్న ‘పన్స్పౌడాస్టికి కేఎస్’ (ఆల్ స్టూడెంట్ కోఆపరేషన్ మూవ్మెంట్) వరుసగా మూడోసారి విజయఢంకా మోగించింది. ఈనెల 22న దేశంలోని అన్ని యూనివర్సిటీలు, టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లలో జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికల్లో విజయం సాధించింది. జూన్ 9న యూరోపియన్ పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు 18 రోజుల ముందు వర్సిటీ ఎన్నికల ఫలితాలు వెలువడటం, పన్స్పౌడాస్టికి కేఎస్ విజయం సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. యూరోపియన్ పార్లమెంటు ఎన్నికలపై దీని ప్రభావం ఉండబోతోంది. పన్స్పౌడాస్టికి కేఎస్ 47.08శాతం ఓట్లతో గెలిచింది. సమీప ప్రత్యర్థి డీఏపీకి 18.51శాతం, సోషల్ డెమొక్రటిక్ పీఏఎస్పీకి 3.15శాతం చొప్పున ఓట్లు పోలయ్యాయి. అలాగే లెఫ్టిస్ట్ ఈఏఏకేఏఆర్ఈఎన్కు 6.32 శాతం, సిరిజా
డిక్ట్యోకు 0.81శాతం చొప్పున ఓట్లు వచ్చాయి. 2023లోనూ పన్స్పౌడాస్టికి కేఎస్కు 44.63శాతం ఓట్లు వచ్చాయి. డీఏపీకి 23.04 శాతం ఓట్లు లభించాయి.