రిషి సునాక్, కైర్ స్టార్మర్ మధ్య హోరాహోరీ
లండన్: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ గురువారం మొదలైంది. ముందస్తు ఎన్నికలకు ప్రధాని రిషి సునాక్ వెళ్లిన విషయం తెలిసిందే. రిషి సునాక్కు, లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్కు మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. బ్రిటన్, ఇంగ్లండ్, నార్తెన్ ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్లో పోలింగ్ జరుగుతుంది. 650 స్థానాలకు బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరు గుర్తింపు కార్డును చూపించాలన్న నిబంధన అమల్లోకి వచ్చింది. ఇమ్మిగ్రేషన్ ఉన్న వారికీ ఓటు హక్కు వచ్చింది. 18 లక్షల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రానికి ఫలితాలను ప్రకటిస్తారు. బ్రిటన్ వ్యాప్తంగా 40 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చర్చి హాల్స్, కమ్యూనిటీ సెంటర్లు, స్కూళ్లతో పాటు పబ్లు, షిప్ల్లోనూ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 46.5 మిలియన్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. బ్రిటన్లో గుర్తింపు పొందిన పార్టీలు మొత్తం 392 ఉన్నాయి. అయితే కన్జర్వేటివ్, లేబర్ పార్టీల మధ్య ప్రధానంగా పోరు సాగుతుంది. 15 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న లేబర్ పార్టీ ఈసారి గెలుపు దీమాతో ఉంది. ప్రీ పోల్ సర్వేలు సైతం ఈ పార్టీకి అనుకూలంగా వెలువడ్డాయి. కాగా, 2019లో బోరిస్ జాన్సన్ నాయకత్వంలో కన్జర్వేటివ్ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది.