ఐదుగురి మృతి
బ్రసెల్స్: యూరప్ దేశాలను ప్యారట్ ఫీవర్ వణికిస్తోంది. ఇప్పటికే ఐదుగురు ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్యారట్ ఫీవర్ సోకిన వారికి శ్వాసకోస వ్యాధులు వస్తున్నాయి. తీవ్ర జ్వరం, తలనొప్పి, పొడి దగ్గు, కండరాల నొప్పులు బాధిస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్లో ఈ కేసులు పెరిగాయి. ఇన్ఫెక్షన్కు గురైన పక్షుల ద్వారా మనుషులకు ఈ వైరస్ ప్రబలుతోంది. క్లామిడోఫిలా సిటాసి అనే బ్యాక్టీరియా ఇందుకు కారణం. పౌల్ట్రీ, వెటరినరీ విభాగాల్లో పనిచేసేవారు, పక్షులు పెంచుకొనేవారు ఎక్కువగా ఈ వ్యాది బారిన పడుతున్నారు. బ్యాక్టిరియా శరీరంలోకి ప్రవేశించిన 5 నుంచి14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయట పడుతున్నాయి. ఇప్పటికే ఐదుగురు చనిపోవడంతో యూరప్ ప్రజల భయపడుతున్నారు.