ఏథెన్స్: గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) అనుబంధ కేఎన్ఈ 49వ మహోత్సావం సెప్టెంబరు 21, 22, 23 తేదీల్లో రాజధాని ఏథెన్స్లో జరగనున్నాయి. కమ్యూనిస్టు కవి నజీం హిక్మత్ స్ఫూర్తితో ‘వెలుగు చీకటిని జయిస్తుంది’ అనే నినాదంతో ‘కేఎన్ఈ
ఒడిగిటిస్’ ఉత్సవం నిర్వహిస్తారు. ఇదే క్రమంలో జులై, ఆగస్టు నెలల్లో గ్రీక్ నగరాల్లోనూ ఉత్సవాలు జరుగుతాయి. వీటిలో భాగంగా రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 21, 22, 23 తేదీల్లో ఏథెన్స్లోని త్రిట్సిస్ పార్కులో యువజన మహోత్సవాలు జరుగుతాయి. సెప్టెంబరు 23న నిర్వహించే ప్రధాన రాజకీయ కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా కేకేఈ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్ కౌట్సోంబస్, కేఎన్ఈ కార్యదర్శి థోడోరిస్ కౌట్సంటిస్ ఉంటారు. ప్రతి సంవత్సరం వలే ఈసారి కూడా గ్రీస్కు చెందిన ప్రఖ్యాత కళాకారులు సంగీత ప్రదర్శనలు ఇస్తారు. ఈ ఉత్సవాలకు 50ఏళ్ల చరిత్ర ఉంది. ఏడేళ్లు సాగిన సైనిక నియంత పాలన కుప్పకూలిన కొద్ది నెలలకు అంటే 1975, సెప్టెంబరులో కేఎన్ఈ, దాని అధికార ప్రతిక ‘ఒడిగిటిస్’ మొదటిసారి ఈ ఉత్సవాలు నిర్వహించాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వీటిని పెద్దఎత్తున నిర్వహించడం ఆనవాయితీగా మారింది.