లెబనాన్లో గాజా తరహా పరిస్థితి వద్దు
ఇజ్రాయిల్కు అమెరికా హితవు
వాషింగ్టన్/టెల్అవీవ్: లెబనాన్లో సైనిక చర్యలు గాజాలో మారణహోమాన్ని తలపించేవిగా ఉన్నాయని, ఇది సరైన పద్ధతి కాదని ఇజ్రాయిల్కు అమెరికా హితవు పలికింది. పౌరహత్యలు ఆక్షేపణీయమని పేర్కొంది. సాధ్యమైనంతగా ప్రాణ నష్టాన్ని నివారించాలని కోరింది. గాజా గతే పట్టిస్తామంటూ లెబనాన్కు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించడంపై అమెరికా స్పందించింది. ఇదే క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసినట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. అమెరికా ప్రతినిధి మాథ్యూ మిల్లర్ విలేకరులతో మాట్లాడుతూ ‘గాజా తరహా సైనిక చర్యలు లెబనాన్లో జరగరాదు. గాజా తరహా పరిణామాలు లెబనాన్లో ఉండరాదు’ అని నెతన్యాహుకు బైడెన్ సందేశమిచ్చినట్లు వెల్లడిరచారు. ముఖ్యంగా అధిక జనాభా ఉండే బీరుట్ వంటి ప్రాంతాల్లో సైనిక చర్యలను నివారించాలని హితవు పలికినట్లు చెప్పారు. ఇరాన్కు బదులివ్వాలని ఇజ్రాయిల్ భావిస్తుండటంతో ఇద్దరు నేతలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకోవాలని నిర్ణయించారన్నారు.
ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటాం: ఇజ్రాయిల్ రక్షణ మంత్రి
ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యోవ్ గల్లెంట్ స్పష్టంచేశారు. ఆ దేశం ఉలిక్కిపడేలా, నిర్ఘాంతపోయేలా భీకర దాడులను ఇజ్రాయిల్ చేయనుందని ఇటీవల హెచ్చరించారు. కోలుకునే సమయం కూడా ఇరాన్కు ఇవ్వకుండా దాడులు చేస్తామని పేర్కొన్నారు. కాగా, సెప్టెంబరు 23వ తేదీ నుంచి లెబనాన్లో హెజ్బుల్లా లక్ష్యంగా వైమానిక దాడులను ఇజ్రాయిల్ చేపట్టింది. సెప్టెంబరు 30న భూతల దాడులను మొదలు పెట్టింది. అప్పటి నుంచి వైమానిక, భూతల దాడులతో విధ్వంసం సృష్టిస్తోంది. లక్షల మంది తమ ఇళ్లు వాకిళ్లు వదిలిపెట్టేలా చేసింది.
మరో ఇద్దరు హెజ్బుల్లా కమాండర్లు హతం: ఐడీఎఫ్
గత 24 గంటల్లో తమ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. 100 హెజ్బుల్లా లక్షాలను ధ్వంసం చేసినట్లు వెల్లడిరచింది. మరో ఇద్దరు హెజ్బుల్లా కమాండర్లను హతమార్చినట్లు ప్రకటించింది. హౌలా ఫ్రంట్ కమాండర్ అహ్మద్ ముస్తఫా అల్ హజ్ అలీ, మెయిస్ ఎల్ జబాల్ ప్రాంతంలో హెజ్బుల్లా యాంటీ ట్యాంగ్ యూనిట్ కమాండర్ మహమ్మద్ అలీ హందాన్ను చంపినట్లు ఐడీఎఫ్ తెలిపింది. హెజ్బుల్లా సభ్యుడు అధమ్ జహౌట్ను సిరియాలో హతమార్చినట్లు వెల్లడిరచింది.
గాజా స్కూలుపై దాడిలో 22 మంది మృతి
గాజా స్ట్రిప్లోని డెయిర్ అల్ బలాప్ా నగరంలోగల స్కూలుపై ఇజ్రాయిల్ దాడులకు తెగబడిరది. ఈ ఘటనలో 22 మంది చనిపోయారు. ఈ మేరకు గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం డైరెక్టర్ ఇస్మాయిల్ అల్ తవాబ్తా వెల్లడిరచారు. పలస్తీనా ప్రతిఘటన యోధులు ఉన్నారన్న నెపంతో ప్రస్తుతం శిబిరాలుగా ఉన్న స్కూళ్లపై ఇజ్రాయిల్ సైన్యం దాడులు చేస్తోందని, ఇజ్రాయిల్ వాదన క్షేత్రస్థాయి పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉన్నదని పేర్కొన్నారు. స్కూలుపై ఇజ్రాయిల్ బాంబులు కురిపించగా 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అల్ జజీరా కూడా నివేదించింది.