వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు రోజులు సమీపిస్తున్నాయి. నవంబరు 5న పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్లో మరోసారి ముఖాముఖికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. పాక్స్ న్యూస్ ఆహ్వానాన్ని స్వీకరించడం లేదని తెలిపారు. అధ్యక్షుడు జో బైడెన్ మార్గాన్నే అనుసరిస్తానని కమలా హారిస్ చెప్పారు… గత రెండు డిబేట్లలో నేను గెలిచిన తర్వాత ఇక చర్చించేందుకు ఏమీలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అభ్యర్థుల మధ్య రెండవ దఫా చర్చలు నిర్వహించే ప్రక్రియ ఇప్పటికే ఆలస్యమైందని ఆయన ‘ట్రూత్’లో పేర్కొన్నారు. అక్టోబర్ 24`27 తేదీల మధ్య చర్చకు ఆహ్వానిస్తూ హారిస్, ట్రంప్కు లేఖలను ఫాక్స్న్యూస్ పంపిన నేపథ్యంలో ట్రంప్ ఈ మేరకు స్పందించారు. అక్టోబర్ 23న సీఎన్ఎన్ చర్చకుగాను కమలా హారిస్ గతంలో సవాల్ విసిరినప్పటికీ… ట్రంప్ అందులో పాల్గొనేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబరు 12న తొలిసారి ముఖాముఖీ చర్చలో పాల్గొని 90 నిమిషాల పాటు అనేక అంశాలపై చర్చించారు.
మాటల యుద్ధంతో వారి చర్చ ముగిసింది. కమలా హారిస్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ, తన మాటలను సమర్థించుకోవడం తప్ప ట్రంప్ పెద్దగా ఆ చర్చలో రాణించలేకపోయారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే గత డిబేట్లలో గెలుపు తనదే అంటూ ట్రంప్ ప్రకటించుకున్నారు.