అప్రమత్తంగా ఉండాలని భారత్ హెచ్చరిక
బీరుట్: ఇజ్రాయిల్ చేస్తున్న భీకర దాడులతో గాజా నగరాలు సర్వనాశనమవుతున్నాయి. ఇప్పటివరకు గాజాకు మాత్రమే పరిమితమైన ఈ యుద్ధం… తాజాగా లెబనాన్కూ పాకే అవకాశం ఉందన్న భయం పశ్చిమాసియాను వణికిస్తోంది. ఇజ్రాయిల్పై హెజ్బొల్లా దాడి చేయడమే ఇందుకు కారణం. ప్రతిస్పందనగా లెబనాన్పై ఏ క్షణమైనా ఇజ్రాయిల్ దాడి చేయవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై భారత్ అప్రమత్తమైంది. లెబనాన్లో ఉంటున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, బీరుట్లోని రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఈ ప్రాంతంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లెబనాన్లోని, లెబనాన్కు ప్రయాణించాలనుకునే భారతీయులు జాగ్రత్తగా ఉండాలి. బీరుట్లోని రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలి’ అని లెబనాన్లోని భారత్ ఎంబసీ సలహా ఇచ్చింది. కార్యాలయ ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు వెల్లడిరచింది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీరుట్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే అనేక విమానాలు రద్దు కావడం, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. గాజా కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని రోజుల్లోనే కుదురుతుందని భావిస్తున్న తరుణంలో ఇజ్రాయిల్లోని మజదల్ షమ్స్పై హెజ్బొల్లా దాడి చేసింది. ఆ దాడిలో 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తాజా ఉద్రిక్తతలకు దారితీసింది. ఇదే సమయంలో దీటుగా ప్రతిస్పందించిన ఇజ్రాయిల్… లెబనాన్పై సోమవారం డ్రోన్లతో దాడి మొదలుపెట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడిరచారు.