విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్నను,వారు అనతి కాల వ్యవధి లో 57 పుస్తకాలు వ్రాసి,ముద్రించడమే కాకుండా బాలసాహిత్యంలో విశేష కృషికి గాను గౌరవ డాక్టరేట్ వరించింది.శనివారం హైదరాబాద్ లోని ఇందిర ఆర్ట్ ఫౌండేషన్ మరియు ఫ్రెండ్ షిప్ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సంస్థలు,తెలంగాణ ఆధ్వర్యంలో, మిర్వ కాఫీ హోటల్ దగ్గర,అల్లైడ్ ఆర్టిస్ట్స్ ఆడిటోరియం,హిమాయత్ నగర్ లో ప్రముఖుల సమక్షంలో గౌరవ డాక్టరేట్ ను గద్వాల సోమన్న అందుకున్నారు.ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన కవులు,కళాకారులు పాల్గొన్నారు.గౌరవ డాక్టరేట్ గ్రహీత గద్వాల సోమన్నను పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.