విశాలాంధ్ర- కర్నూలు సిటీ: రాజకీయ పార్టీలు, సంఘాలకు అతీతంగా జులై 9న జరగనున్న బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనానికి అందరూ ఆహ్వానితులేనని,ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై బ్రాహ్మణ ఐక్యతను చాటలని బ్రాహ్మణ ఐక్యవేదిక నాయకులు సముద్రాల హనుమంతరావు కోరారు.శుక్రవారం కర్నూలు నగరంలోని బ్రాహ్మణ ఐక్యవేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత, బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరణ, రుద్రభూమి ఏర్పాటు,పింఛన్ల పునరుద్ధరణ,చదువుకుంటున్న పిల్లలందరికి స్కాలర్ షిప్స్, నివాస స్థలాలు,
చిరు వ్యాపారాలకు కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు తదితర హక్కులను సాధించుకునేందుకు ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం మౌర్య ఇన్ ఫంక్షన్ హల్ నందు సాయంత్రం 6గంటలకు జరగనున్న సమావేశంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమతమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈసమావేశంలో బ్రాహ్మణ నాయకులు
కంచు గంటల శ్యామ సుందర శర్మ,రవిచంద్ర శర్మ, ఆనందరావు,శ్రీనివాసులు, సాయికుమార్, మారుతమ్మ, అధ్యక్షులు సండేలు చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.