అభివృద్ధి పనులకు టీడీపీ నేతలు శంకుస్థాపన
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : ముందెన్నడూ లేనివిధంగా గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి స్పష్టం చేశారు. మండల పరిధిలోని పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని హనుమాపురం, రాగిమాన్ దొడ్డి, గంగులపాడు, పెద్దకడబూరు గ్రామాల్లో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న, బీసీ సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నరవ రమాకాంతరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పల్లె పండుగ ద్వారా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. హనుమాపురంలో రూ. 10 లక్షలు, రాగిమాన్ దొడ్డి, గంగులపాడులలో 5 లక్షల చొప్పున, పెద్దకడబూరులో 30 లక్షల వ్యయంతో సీసీ రోడ్లను నిర్మిస్తామని తెలిపారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంచాయతీ నిధులను దోచేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు విడుదల చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామాల రూపురేఖలను కూటమి ప్రభుత్వంతో మారబోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాపురం సర్పంచ్ పూజారి ఇందిరమ్మ, పెద్దకడబూరు గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, ఎంపీడీఓ జయరాముడు, ఏఈ ఖాదర్ బాషా, ఏపీఎం శ్రీనివాసులు, ఏపీఓ ఖాదర్ బాషా, టీడీపీ నాయకులు మీ సేవ ఆంజనేయులు, ఈరన్న, రంగన్న, పెద్దయ్య, వెంకటరెడ్డి, రాముడు, రాఘవేంద్రస్వామి, హనుమేశప్ప, సోమన్న, బొగ్గుల తిక్కన్న, తలారి అంజి, ఆశన్న, బొగ్గుల నరసన్న, రామాంజినేయులు, హనుమంతు, ఇమ్మానియేలు, ఆదాము తదితరులు పాల్గొన్నారు.