విశాలాంధ్ర, పెద్దకడబూరు : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రచార బస్సు యాత్రలో భాగంగా పెద్దకడబూరుకు విచ్చేసిన కోట్ల విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ ప్రాంత రైతులకు ఎల్లెల్సీ జీవనాధారమని గుర్తు చేశారు. కానీ ఆంధ్ర ప్రాంతానికి రావాల్సిన సాగునీటి వాటా సక్రమంగా రాకపోవడానికి కారణం ఎగువ ఉన్న కర్ణాటక ప్రాంతంలో జలచౌర్యానికి పాల్పడడమేనని తెలిపారు. జలచౌర్యం అరికట్టడానికి గతంలోనే 18 కిలోమీటర్లు పైపులైన్ వేసి ఆంధ్రకు రావాల్సిన నీటి వాటా తెచ్చేందుకు గతంలో చంద్రబాబును ఒప్పించామని స్పష్టం చేశారు. పులికనుమ ప్రాజెక్టును ప్రారంభించి, వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడి కాలువ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి రైతుల పక్షపాతిగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎల్లెల్సీకి రావాల్సిన నీటివాటాను రాబట్టడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి, జిల్లా అధ్యక్షులు బీటీ నాయుడు, రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు బసలదొడ్డి ఈరన్న, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.