విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ ఇవ్వాలని సోమవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ఎమ్మార్సీ భవనం నందు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీయూడబ్ల్యూజే మండల కమిటీ ఆధ్వర్యంలో మండల విద్యాధికారులు సువర్ణల సునియం, రామ్మూర్తిలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే తాలూకా ఉపాధ్యక్షులు పుల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి రామన్న, కోశాధికారి నారాయణ మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలో కూడా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలో 60 శాతం ఫీజు రాయితీ తో ఉచితంగా విద్యను అందించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు మల్లికార్జున, ఏలియస్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.