విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 38 వర్ధంతి వేడుకలు జైభీమ్ ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జీ ,అధ్యక్షులు ఉపాధ్యక్షులు రవికుమార్, ఆదాము బుజ్జప్ప ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతిలోకి తీసుకొచ్చేందుకు పోరాడిన ఘనత బాబు జగ్జీవన్ రామ్ కే దక్కుతుందని కొనియాడారు. జనం కోసం తన 50 ఏళ్ల జీవితాన్ని అంకితం చేసి, దేశంలోనే దళతుల్లో ఉప ప్రధానిగా పనిచేసి, తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేకుండా తన ప్రత్యర్థులతో శభాష్ అనిపించుకున్న మహోన్నత వ్యక్తి అన్నారు. రాబోయే రోజుల్లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలను, ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మడ్రి ఆదాము, దినాకర్, హానోకు, ఆనందు, బాలరాజు, మద్దిలేటి, కుమార్, అనిల్, నవీన్, బాబు, కర్ణ తదితరులు పాల్గొన్నారు.