విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులో మండల విద్యాధికారి రామ్మూర్తి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జీ సునీత ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేను బడికి పోతా కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల నుంచి ఆడ పిల్లల చదువు – అవనికి వెలుగు, పెద్దలు పనికి పిల్లలు బడికి, బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి అంటూ నినాదాలు చేస్తూ గ్రామ పురవీదుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఆవరణంలో మానవహారం నిర్వహించారు. అనంతరం వారు చదువు వల్ల మనిషి విజ్ఞానాన్ని పెంచుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ స్వర్ణలత, ఉపాధ్యాయులు చంద్రకళ, మల్లికార్జున, శ్రీనివాసులు, రాఘవేంద్ర, బసవరాజు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.