ఆలూరు టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ్
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : పల్లెల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆలూరు టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ్ అన్నారు. పల్లెపండగ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని బిణిగేరి, జొహరాపురం గ్రామాల్లో గోకులం షెడ్డు, సీసీ రోడ్డు నిర్మాణాలకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీలు అబివృద్ధి చెందినప్పుడే ప్రగతి సాధ్యమన్నారు. అందుకోసమే డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సుదుద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో రోడ్డు రవాణా మెరుగపరచేందుకు సీసీ రోడ్డు నిర్మాణాలు చేపట్టినట్టు చెప్పారు. గత ప్రభుత్వంలో పాలన పడకేసి కనీస రోడ్లకు తట్ట మట్టి కూడా పోసిన పాపాన పోలేదన్నారు. ప్రజలు రోడ్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు నరకాన్ని చవిచూశారన్నారు. ఇక నుంచి అలాంటి ఇబ్బందులు లేకుండా చేయటమే తన కర్తవ్యంగా భావిస్తున్నానన్నారు. మండలంలో త్రాగునీటి సమస్య తీవ్రత తన దృష్టికి వచ్చిందని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామన్నారు. నియోజకవర్గ సస్యశ్యామలానికై వేదావతి ప్రాజెక్టును 8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ పరమారెడ్డి, ప్రధాన కార్యదర్శి శేషాద్రి నాయుడు, బిజెపి తాలూకా ఇన్చార్జి వెంకటరాముడు, మాజీ కన్వీనర్ లు శ్రీనివాసులు గౌడ్,తిమ్మన్న, మాజీ చైర్మన్ లు సాలీ సాహెబ్, మల్లికార్జున రెడ్డి, బసవరాజు, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు ఉచ్చిరప్ప యాదవ్, టిడిపి మండల నాయకులు శీను, తిక్కయ్య, రాజ్ కుమార్, సతీష్ కుమార్, హనుమంతు రెడ్డి, ఈరన్న, మధు ఎంపీడీవో గీతవాణి ఉపాధి హామీ పథకం ఏపీడి ఏపీఓ రామకృష్ణ, ఏపీయం జనార్ధన్, పంచాయితీ కార్యదర్శి జంప్లా నాయక్, వివిధ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.