దేశంలో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకులోపే నమోదవుతున్నాయి. అయితే, ఇదే సమయంలో మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా దేశంలో 1,190 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,55,828కి చేరింది. ప్రస్తుతం దేశంలో 16,243 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా1,375 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,452కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. ఇక మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98. 78శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడిరచింది.