న్యూదిల్లీ: గ్లోబల్ పాన్ఇస్లామిక్ సంస్థగా 1953లో జెరూసలేంలో హిజ్బ్
ఉన్తహ్రీర్ ఏర్పాటైంది. బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు 30 దేశాల నుంచి ఇది పనిచేస్తోంది. హిజ్బ్
ఉన్`తహ్రీర్ను ఉగ్రవాద సంస్థగా మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. యువతను ఉగ్ర సంస్థల్లో చేరేలా ప్రేరేపించడం, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడం, నిధులు సేకరించడం వంటివి చేస్తున్నందున దీనిని ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తున్నట్లు గెజెట్ నోటిఫికేషన్లో హోం వ్యవహారాల శాఖ (ఎంహెచ్ఏ) తెలిపింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదంటూ ఎక్స్లో అమిత్షా పేర్కొన్నారు. ఇప్పటికే హిజ్బ్ఉన్
తహ్రీర్పై ఇప్పటికే అనేక దేశాలు నిషేధం విధించాయి. వాటిలో జర్మనీ, ఈజిప్టు, బ్రిటన్తో పాటు అనేక ఆసియా, ఆరబ్ దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ చేరింది.