Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

నదిలో పడిపోయిన బస్సు


ఆరుగురు మృతి

మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాంగ్‌చ్రామ్‌ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ప్రయాణికులతో వెళుతున్న బస్సు బ్రిడ్జిపై నుంచి నదిలోపడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గాయపడ్డారు. తురా నుంచి షిల్లాంగ్‌ నగరానికి వెళుతున్న బస్సు.. ప్రమాదవశాత్తు నోంగ్‌చ్రామ్‌లోని రింగ్ది నదిలో పడిపోయింది. వంతనపైనుంచి నీటిలో బోల్తా పడిరదని పోలీసులు వెల్లడిరచారు. కాగా.. ప్రమాదం జరిగిన బస్సులో 22 మంది ప్రయాణికులున్నారని ఈస్ట్‌ గారో హిల్స్‌ పోలీసులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని చికత్స అందుతుందని వెల్లడిరచారు. మృతుల్లో బస్సు డ్రైవరు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img