Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

32 ఏళ్ల మహిళతో 56 ఏళ్ల వ్యక్తి సహజీవనం.. ముక్కలుగా నరికి, ప్రెషర్ కుక్కర్లో ఉడికించి..!

ముంబై నగర శివార్లలో ఘోరమైన హత్య

శ్రద్ధవాకర్ హత్య గుర్తుందా..? ఆమెను హతమార్చిన ప్రియుడు.. శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచి పెట్టిన తీరు అందర్నీ విస్మయానికి గురి చేసింది. ఇప్పుడు ఆ హత్య కేసు కంటే ఘోరమైన హత్య కేసు మహారాష్ట్రలో వెలుగు చూసింది. ముంబై నగర శివార్లలో 32 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్న 56 ఏళ్ల వ్యక్తి.. ఆమెను హత్య చేశాడు. చెట్లను నరికే యంత్రంతో ఆమె శరీరాన్ని ముక్కలుగా చేశాడు. కొన్ని ముక్కలను కుక్కలకు ఆహారంగా వేసిన అతడు.. మరికొన్ని శరీర భాగాలను ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించి.. ప్లాస్టిక్ కవర్లో వేసి పడేశాడు.హత్యకు గురైన మహిళ పేరు సరస్వతి వైద్య కాగా.. అనుమానితుడి పేరు మనోజ్ సహనీ. మీరా రోడ్ ప్రాంతంలోని గీతా నగర్ ఏడో ఫేజ్‌లోని గీతా ఆకాశ్ దీప్ బిల్డింగ్‌.. ఫ్లాట్ నంబర్ 704లో వీరిద్దరూ గత మూడేళ్లుగా కలిసి ఉంటున్నారు. 3-4 రోజుల క్రితం ఆమెను హత్య చేసిన మనోజ్.. ట్రీ కట్టర్‌తో శరీర భాగాలను ముక్కలుగా నరికేశాడు.మనోజ్ ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో.. అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నయానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసుల బృందం అక్కడికి చేరుకుని బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించింది. ఫ్లాట్‌లోకి వెళ్లిన పోలీసులకు ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు దర్శనం ఇచ్చాయి. మహిళ శరీరం ముక్కలుగా కనిపించింది. ఆమె శరీరంలోని కొన్ని భాగాలు కనిపించలేదు. దీంతో నిందితుడు వాటిని పడేసి ఉంటాడని భావిస్తున్నారు.మనోజ్ సహానీ గత రెండు మూడు రోజులుగా వీధి కుక్కలకు ఏదో తినిపించడాన్ని స్థానికులు గుర్తించారు. గతంలో ఇంతకు మునుపెన్నడూ అతడు అలా కుక్కలకు ఆహారం పెట్టడాన్ని తాము చూడలేదని వారు చెప్పారు. దీంతో అతడు వీధి కుక్కలకు తినిపించింది.. మహిళ శరీర భాగాలేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

అంతే కాదు.. తనతో సహజీవనం చేసిన మహిళ శరీర భాగాలను మనోజ్ ముక్కలుగా చేసి.. ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించి.. వాటిని ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసి పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఫ్లాట్ నుంచి పోలీసులు మహిళ శరీరానికి సంబంధించి 12-13 ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

మనోజ్-సరస్వతి తమతో కలిసే వారు కాదని.. స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆ ఫ్లాట్ డోర్‌కు ఎలాంటి నేమ్ ప్లేట్ లేదని.. ఆ ఫ్లాట్ సోనమ్ బిల్డర్స్ పేరిట రిజిస్టర్ అయ్యి ఉందని పోలీసులు తెలిపారు.

శుక్రవారం ముంబై సమీపంలోని ఉత్తాన్ బీచ్‌లో తలలేని మహిళ శవం ఓ ట్రావెల్ బ్యాగ్‌లో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్తే హత్య చేసి ఉంటాడని భావిస్తున్న పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. తలను భయందెర్ వద్ద సముద్రంలో పడేసి ఉంటాడని భావిస్తున్నారు. ఆమెను తల ఇంకా లభ్యం కాలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img