London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

జ్ఞానం ముసుగులో అజ్ఞానుల ప్రవచనాలు

డాక్టర్‌ దేవరాజు మహారాజు

‘‘మానవులంతా ఒకే జాతి వారని చెప్పేందుకు ప్రత్యేక సాక్ష్యాధారాలేం అవసరం లేదు. ఒక కుక్క మరో కుక్కని చూసినపుడు అది తన జాతికి చెందిన జంతువే అని గ్రహించ గలుగుతుంది. మనిషికి మాత్రమే తోటి మనిషిని చూసినపుడు అనేక సందేహాలు కలుగుతుంటాయి. అంటే జంతువు కంటే మనిషే నికృష్టంగా ప్రవర్తిస్తున్నా డన్నమాట?’’అని అన్నారు సామాజిక ఉద్యమకారుడు, తత్త్వవేత్త: నారాయణగురు. ఈ మతం, ఆ మతం అని కాదు దాదాపుగా అన్నీ ఒకటే! బయటికి అన్నీ వేరు వేరుగా కనిపిస్తాయి. కాని, మూర్ఖత్వాన్ని ప్రచారం చేయడంలో ఒకే రకంగా ప్రవర్తిస్తాయి. వేర్వేరు భాషల్లో ప్రవచనాలు, బోధలు, సూక్తులు, దైవ వాక్కుల పేరుతో వేరువేరు ప్రాంతాల్లోనిజనానికి అసత్యాలు బోధిస్తుంటాయి. మూఢ విశ్వాసాలు ప్రచారం చేయడంలో అన్నీ సమైక్యంగా కృషి చేస్తాయి. అసలు విషయం గ్రహించలేక, జనం‘మా మతమే గొప్పది. ఇతరులది కాదు’ అని పోట్లాడుకుంటూ ఉంటారు. వారిలో వారు ద్వేష భావంతో రగిలిపోతుంటారు. మతం గుప్పిట్లోంచి బయటపడిన వారికే నిజాలు బోధపడతాయి. జీవిత సత్యాలు అర్థమవుతాయి. జైశ్రీరామ్‌అంటూ మనో భావాలు దెబ్బతిన్నాయనే వారు కొందరుంటారు. ‘మీకు హిందూ మతమే దొరికిందా? ఇతర మతాల్ని విమర్శించే గుండె ధైర్యం మీకు ఉందా? అని సవాలు విసురుతుంటారు. అలాంటి వారు ఒక విషయం ఆలోచించాలి. ముందు ఎవడి ఇల్లు వాడు శుభ్రం చేసుకుని కదా వీధిలోకి చూడాలీ? ఆ తర్వాత ఎదురిల్లూ ఈపక్క ఆ పక్క ఇళ్లనూ` మీ ఇంట్లో మురికి అలాగే పెట్టుకుని, ఇతరుల ఇళ్లు శుభ్రం చేయడానికి బయలుదేరుతారా? బయలుదేరరు కదా? ఇదీ అలాంటిదే. మత మౌఢ్యాన్ని నిరసించేవారు అన్ని మతాల్లోని మౌఢ్యాన్ని నిరసిస్తారు. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి. ముందు కాస్త అవగాహన పెంచుకోవాలి. ఆ తరువాతే నోరు విప్పాలి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను. ఎవరికి వారు విశ్లేషించుకుని, ఆలోచించుకోండి!

  1. ఎవడైనా శివనింద చేస్తే, వాడి నాలుక ఎడం చేత్తో పట్టుకుని, పైకి లాగికత్తితో మొదటికి పరపరా కోసెయ్యాలి. 2. శివనింద తట్టుకోలేకపోతే ప్రాణం వదిలిపెట్టెయ్యాలి. 3. ఆ రెండిరటికీ నువ్వు చాలకపోతే, చెవులు మూసుకుని, వెళ్లిపోవాలి. 4. శివనింద వినరాదు అనరాదుచేయరాదు. ఇలాంటి మూర్ఖపు బోధనలు చేసేవారు మన మధ్యనే ఉన్నారు. వివేకం అడుగంటిన వారు గడ్డిపోచ ‘పాటి’ వారు మన మధ్యనే ఉన్నారు. జాగ్రత్త! వారిని దరికి రానీయకండి. మీ వివేకాన్ని కప్పేసుకోకండి.
    మతాలు సాగించే పేచీలు ఎలా ఉంటాయో మహాకవి గుర్రం జాషువా వర్ణించిన తీరు చూడండి! ‘‘ఒకడు రుద్రాక్ష మాలికలు నెత్తికి చుట్టి/ శివమూర్తిjైు భూమి కవతరించు/ ఒకడూర్ధ్వ పుండ్రంబు లురువుగా తగిలించి/ శివలింగమును జూచి చీదరించు/ ఒకడు రెండును గాని వికట వేషము దాల్చి/ పై వారి మీద సవాలు చేయు/ ఒకడు గంజాయి దమ్ముకు దాసుడైపోయి/ బూడిద గురవడై పుట్టి వచ్చు/ మనుజులార మాది ఘనమైన మతమని/ ఒకడు తరిమి తరిమి ఉగ్గడిరచు/ పెక్కు మతము లిట్లు పేచీలు సాగింప/ మార్గమేది ఐకమత్యమునకు/ చిలిపి రాళ్లకు నగిషీలు చెక్కి చెక్కి/ కాలమెంత యుగాంతాన గలిపిరొక్కొ/ చదువ నేర్చిన వెర్రిని చంపగలరె?…’’
    ప్రతి శివరాత్రికి ఈశా ఫౌండేషన్‌ నిర్వాహకుడు జగ్గీ వాసుదేవ్‌ ఐదులక్షల యాభైవేల, ఐదువందల టికెట్లు అమ్ము కుంటూ ఉంటాడు. ‘‘దేవుడు, ఆధ్యాత్మికత పేరుతో వ్యాపారం చేస్తున్నాడని’’ స్వయంగా తమిళనాడు ఆర్థిక మంత్రి పిటిఆర్‌. పళనివేల్‌ త్యాగరాజన్‌ ప్రకటించాడు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలను తమ గుప్పిట్లోంచి వదిలేయాలని, వాటిని భక్తులకు అప్పగించాలనీ జగ్గీ వాసుదేవ్‌ చేసిన ప్రకటనకు ప్రతిస్పందనగా ఆర్థికమంత్రి, జగ్గీ బండారం బయట పెట్టాడు. ఆధ్యాత్మికత పేరుతో ధనిక వర్గాన్ని మోసం చేస్తూ, వ్యాపారాలు చేస్తున్న బాబాలస్వాముల బండారం బయటపెట్టాల్సిందే! ఆదివాసుల భూములు అక్రమంగా ఆక్రమించుకుని ‘ఈషా ఫౌండేషన్‌ స్థాపించుకున్న మోసగాడు జగ్గీ వాసుదేవ్‌. తన భార్యను హత్య చేశాడన్న ఆరోపణ లున్నాయి. అలాంటి వాడి మీద ప్రభుత్వం ఎందుకు ఉదాసీన వైఖరితో ఉందీ? ఇంతవరకు కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదూ? ఇటీవల స్వామి ఆనంద్‌ స్వరూప్‌ వ్యభిచారం బయటపడిరది. ముస్లింలు, క్రైస్తవులు భారతదేశం నుండి వెళ్లిపోవాలని ప్రభోదించిన శంకారాచార్య పరిషత్‌ అధ్యక్షడు స్వామి ఆనంద స్వరూప్‌ శ్రీలంకలో వేశ్యలతో పట్టుబడ్డాడు. ఒక గదిలో ఒకేసారి ఇద్దరు మహిళలతో దొరికిపోయాడు. వీడియో జర్నలిస్ట్‌లు కెమెరాలతో ఆ గదిలోకి ప్రవేశించే సరికి బట్టలు కప్పుకుంటూ ఆ ముగ్గురూ నానా తంటాలు పడ్డారు. స్వామి ఆనంద స్వరూప్‌ అనే వాడికి దేహశుద్ది జరిగింది. ఈ మొత్తం చిత్రించిన వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. బుద్ది, జ్ఞానం లేని వాళ్లు ఈ దేశంలో స్వామీజీలు అయిపోతున్నారు. లేదా బూర్జువా రాజకీయపార్టీలలో నాయకులై అధికారం చేజిక్కించుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలి! మతాలకు రాజకీయాలకు ఉన్న లింకు తెగితేనే అది సాధ్యం! కేవలం పదిహేను వందల ఏళ్ల క్రితం మదీనాలో అంటే దేవదూత అనే ప్రాఫెట్‌ మహ్మద్‌ జన్మస్థానంలో ఖురాన్‌ అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. సాధారణ శకం 570 632 సీఈ మధ్య కాలంలో జీవించిన ప్రాఫెట్‌ మహ్మద్‌ జ్వరంతో చనిపోయాడని చరిత్రలో నమోదై ఉంది. మరి ఆ దేవదూతను ఏ దేవుడూ బతికించలేదు. ఖురాన్‌ సృష్టి ప్రారంభం నుండే ఉందిఅని ముస్లిం మత పెద్దలు ప్రచారం చేసుకుంటారు. అన్ని మతాల మత పెద్దలదీ ఇదే వరస! అబద్దాలనే ప్రచారం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ‘‘మా మతంలో చంద్రుడికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే చంద్రుడు రాత్రివేళల్లో మాకు అవసరమున్నప్పుడు వెలుగునిస్తాడు. సూర్యుడిలాగా పగటిపూట వెలగడు. పగటిపూట వెలుతురు ఎవడికి కావాలీ? దీనివల్ల ఏం తెలుస్తుందంటే మతాలన్నింటిలోకి మా ముస్లిం మతమే తెలివైనదని!’’ అని అన్నాడు ఒక ముస్లిం మత పెద్ద మౌలాన హుజూర్‌ ముఖ్‌ ముద్దీన్‌ ఖాన్‌వారి తెలివిగల మతం గురించి ఈ తెలివి గల మతపెద్ద ఎంత తెలివిగా మాట్లాడారో కదా? పగటి వెలుగులన్నీ సూర్యుడిస్తున్నవేనన్న ప్రాధమిక అవగాహన లేని ఈ మౌలాన, మూర్ఖత్వాన్ని ఎవడు ఛేదించాలీ? సూర్యుడి వెలుగులు లేకపోతే చెట్లు, జంతువులు, మనుషులు ఏవీ బతకలేవని ఈయనకు ఎవరు చెప్పాలి? ఇక, విటమిన్‌డి పరిజ్ఞానం కలగాలంటే ఇంకా ఎన్ని శతాబ్దాలు గడవాలీ? ముస్లిం మహిళలు వేసుకునే బురఖా సంప్రదాయం ఐదువేల ఏళ్ల క్రితం వ్యభిచారులది. తాము వ్యభిచారులమని గుర్తించడానికే అలా వేసుకునే వారు. పైగా, తమని వ్యక్తిగతంగా గుర్తుపట్టకుండా ఉండడానికి కూడా అది ఉపయోగపడేది. ఒక టర్కిష్‌ మహిళా పరిశోధకురాలు శిలా శాసనాలు అధ్యయనం చేసి, ఈ విషయం వెల్లడిరచారు. అయితే టర్కిష్‌ ప్రభుత్వం ఆ దేశపు చట్టం ప్రకారం ఆమె మీద 301 పీనల్‌ కోడ్‌ మత విశ్వాస దూషణ కింద కేసు పెట్టింది. అయితే, ఆ దేశపు సుప్రీంకోర్టు ఆ కేసు చెల్లదని ఆమె పరిశోధనకు గుర్తింపునిస్తూ తీర్పు వెలువరించింది. ఈ విషయం మన కేంద్ర ప్రభుత్వం వారికీ, గతంలో కర్నాటకలో ప్రభుత్వం వెలగబెట్టిన రాష్ట్ర బిజేపీ వారికీ తెలిసిందో లేదో. తెలియకపోతే, తెలియజేయాలి. ముస్లింల వస్త్రధారణ మీదే కదా వారు గోలగోల చేస్తారూ?
    గొప్పగా చెప్పుకునే ఖురాన్‌లోని కొన్ని అంశాలు చూద్దాం. మానవీయ విలువల్ని అది ఎంతగా నిలపగలుగు తుందో ఆలోచిద్దాం!
    అల్లాను నమ్మని వారిని కనిపించిన చోటనే నరికి చంపండి. (2:191) ముస్లింలు, ముస్లింలు కాని వారితో స్నేహం చేయరాదు (3:28) ఇస్లాం తప్ప ఒంకే మతమూ ఒప్పుకోదు (3:85) ఇస్లాంను విమర్శించే వారిని వికలాంగులను చేసి వేలాడదీయండి (5:33) ఖురాన్‌ కాక, ఇతర గ్రంథాలను నమ్మేవారిని భయభ్రాంతులను చేసి వారి తలలు తీయండి (8:12) అల్లాను నమ్మని వారిని భయభ్రాంతులను చేయుటకు ముస్లింలు తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలను వాడాలి(8:60) అల్లాను నమ్మనివారు మూర్ఖులు . ముస్లింలు వారితో పోరాడాలి (8:65) అవకాశం దొరకగానే అల్లాను నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ చంపేయండి (9:5) యూదులు, క్రిస్టియన్లు భ్రష్టులు. వారితో పోరాడండి (9:30) మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసులతో యుద్ధం చేయండి (9:124) అల్లాను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో, ఇనుప చువ్వలతో, మసిలే నీళ్లతో శిక్షించండి. వారి చర్మం, శరీరం కరిగిపోవాలి (22:19) అల్లాను నమ్మనివారితో శాంతి కోసం, సంధి కోసం, ప్రయత్నించకండి. వారు దొరికినంతనే నరికేయండి (47:4).
    శివనింద చేసిన వాణ్ణి ఏం చేయాలో ఓ హిందూ గురువు చెప్పాడు కదా? అల్లాను నమ్మని వాణ్ణి ఏం చేయాలో ఈ ముస్లిం గ్రంథం కూడా చెపుతోంది. ఇలాంటి మతాలు, మత గ్రంథాలు, మత గురువులూ మనకు అవసరమా? ఇది మానవ సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి కోసం దోహదం చేసేవేనా? ఉగ్రవాదం బలపడడానికి ఇవి కారణం కాదా? నోబెల్‌ పురస్కార గ్రహీత మలాలా యూసఫ్‌ జాయ్‌ ఏమన్నారో గుర్తు చేసుకోండి. ‘‘ముందు తరాలకు విద్యను అందించాలి. లేకపోతే వారికి ఉగ్రవాదులు తుపాకులు అందిస్తారు’’అని ఆమె చెప్పిన మాట నిత్య జీవితంలో మనకు కనబడుతూ ఉంది! ‘‘మన కళ్ల ముందు ఉన్నా మనం చూడని, చూడలేని విషయాలు అనేకం ఉంటాయి. కొన్ని భయం వల్ల చూడం. కొన్ని బలమైన భావజాల ప్రభావం వల్ల మనకు కనిపించవు. ఒక్కోసారి మనకు అలవడిన దృక్కోణం వల్లగానీ, మనం ఎంచుకున్న దృక్కోణం వల్లగానీ, కొన్ని విషయాలు కళ్లముందు ఉండి కూడా కనిపించవు. వీటిలో విడివిడి విషయాలే లేవు. సామాజిక క్రమాలు కూడా ఉంటాయి. వీటిని మనకు చూపించడం సాహిత్యం చేసే పనులలో ఒకటి’’ అన్నారు మానవ హక్కుల ఉద్యమనేత` బాలగోపాల్‌. నిజమే! అలాంటి సాహిత్యాన్ని సృష్టించుకుంటూ, దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ఇప్పుడు మన అందరి తక్షణ కర్తవ్యం.
    సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత ప్రొఫెసర్‌,
    మెల్బోర్న్‌ నుంచి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img