Friday, May 17, 2024
Friday, May 17, 2024

బీసీల ఐక్యతకు ముమ్మర యత్నాలు

శిరందాసు నాగార్జున

బీసీ వర్గాలలోని ఉత్సాహవంతులైన యువత రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా అన్ని విధాల వెనుకబడిన తాము ఏకం కాకపోతే మరో వందేళ్లయినా తమ బతుకుల్లో మార్పు రాదని అంటున్నారు. ముఖ్యంగా బీసీ వర్గాలలోని మేథావులు, ఉద్యోగులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. బీసీ కులాలన్నీ ఏకం కావడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీసీలలో నాయకత్వ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముందు దానిని అధిగమించే ప్రయత్నంలో అన్ని జిల్లాల్లో యువతను ప్రోత్సహిస్తున్నారు. బీసీలలో ఎవరి కులాలు వారివి, ఎవరి వాదాలు, ఎవరి ఆలోచనలు, ఎవరి అభిప్రాయాలు వారివి. విభిన్న దృక్పధాలతో ఉన్న వారందరినీ కలపడానికి బీసీ అనే భావనతో ముందుకు వెళ్లడానికి మేథావి వర్గం ప్రయత్నిస్తోంది.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చినట్లే బీసీ వర్గాల్లో కూడా చైతన్యం మొదలైంది. ఎన్నికలొస్తే రాజకీయ పార్టీలు బీసీల జపం చేయడం అలవాటైపోయింది. కులవృత్తులు చేసుకునే జనసమూహమే బీసీ వర్గాలై నందున జనాభాలో వారు అత్యధికంగా అంటే 50 శాతానికి పైగా ఉంటారు. బీసీలను అనాదిగా ఓటు బ్యాంకుగా చూడటమే ప్రాతీయ పార్టీలకు అలవాటై పోయింది. దానికి తోడు శాసనసభ, లోకసభలలో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు బీసీలకు లేకపోవడం తీవ్రంగా నష్టపోతున్నారు. సమతౌల్యంపేరుతో కొన్ని సీట్లు ఇచ్చినా, గెలిచినవారికి ప్రాధాన్యం తక్కువే. మంత్రి పదవులు కూడా లెక్కకే ఇస్తారు. అధికారం ఏమీ ఉండదు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నచోట బీసీ నేతలు మంత్రులైనా వారి చేతిలో అధికారం నేతిబీరకాయ చందంగా ఉంటుంది. రాజకీయ అధికారం లేకుండా బీసీ వర్గాల అభివృద్ధి సాధ్యంకాదని బీసీలు ఆందోళన చెందుతున్నాయి. రాజకీయ భాగస్వామ్యం కోసం వారు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు.
బీసీ వర్గాలలోని ఉత్సాహవంతులైన యువత రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా అన్ని విధాల వెనుకబడిన తాము ఏకం కాకపోతే మరో వందేళ్లయినా తమ బతుకుల్లో మార్పు రాదని అంటున్నారు. ముఖ్యంగా బీసీ వర్గాలలోని మేథావులు, ఉద్యోగులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. బీసీ కులాలన్నీ ఏకం కావడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీసీలలో నాయకత్వ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముందు దానిని అధిగమించే ప్రయత్నంలో అన్ని జిల్లాల్లో యువతను ప్రోత్సహిస్తున్నారు. బీసీలలో ఎవరి కులాలు వారివి, ఎవరి వాదాలు, ఎవరి ఆలోచనలు, ఎవరి అభిప్రాయాలు వారివి. విభిన్న దృక్పధాలతో ఉన్న వారందరినీ కలపడానికి బీసీ అనే భావనతో ముందుకు వెళ్లడానికి మేథావి వర్గం ప్రయత్నిస్తోంది.
ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 11న హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున బీసీ డిక్లరేషన్‌-2023 మహాభ నిర్వహించారు. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో బీసీలకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌, జస్టిస్‌ వి.ఈశ్వరయ్య, ప్రొఫెసర్‌ మురళీ మనోహర్‌, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.చంద్రకుమార్‌, బీపీ మండల్‌ మనవడు ప్రొఫెసర్‌ సూరజ్‌ యాదవ్‌ మండల్‌, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు చౌదరి వికాస్‌ పటేల్‌, ప్రొఫెసర్‌ ఇనుకొండ తిరుమలి తదితరులు పాల్గొన్నారు. బీసీ ఉద్యమానికి మరింత ఊపునిచ్చేవిధంగా తెలంగాణలో బీసీ జర్నలిస్టులు కూడా రాజకీయంగా ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో బీసీలకు ప్రధాన్యత ఇస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ చెప్పడమేగాక బీసీలకు రూ.లక్ష సహాయం పథకం కూడా ప్రకటించింది. బీజేపీ ఏకంగా పలు అంశాలతో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించింది. కాంగ్రెస్‌ కూడా బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తామని తెలిపింది.
ఈ నేపథ్యంలో బీసీ ముఖ్య నేతలు తెలంగాణ, ఏపీలలో అన్ని జిల్లాలలో పర్యటిస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, బీసీలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేతలు గుజ్జ కృష్ణ, డాక్టర్‌ నందకిషోర్‌, మల్లేశ్‌ తదితరులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఏపీలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, ఆ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తదితరలు పర్యటిస్తూ సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆగస్టు 7న తిరుపతిలో భారీ స్థాయిలో ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్లు కేసన శంకరరావు ప్రకటించారు. ఏపీలో ఇటు వైసీపీ, అటు టీడీపీ బీసీల జపం చేస్తున్నాయి. వైఎస్‌ జగన్‌ సీఎం కాగానే మంత్రి పదవులు, నామినేటెడ్‌ పదవులు బీసీలకు బాగా ఇచ్చారు. గతంలో ఇవ్వని కులాలకు కూడా కొన్ని పదవులు ఇచ్చారు. ఈ పదవుల వల్ల వారికి ఒరిగింది ఏమీలేదు. ఏవిధమైన అధికారంలేదు. అయినా, గుర్తించి పదవులు ఇచ్చారనే సంతృప్తి వారిలో కనిపిస్తోంది. టీడీపీ గత ప్రభుత్వంలో పదవులు ఇవ్వడంలో న్యాయం చేయలేదన్న విమర్శ ఉంది. ముఖ్యంగా నామినేటెడ్‌ పదవులు చివరి వరకు భర్తీచేయకుండా బీసీలకు అన్యాయం చేశారన్న భావన ఉంది. అయితే, పార్టీలో ఈ విషయమై చర్చ జరిగిందని, ఇక ముందు అలా జరగదని ఆ పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఈసారి ఇరు పార్టీలు పోటీపడి బీసీలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. దానిని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలో బీసీ నేతలు ఉన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా బీసీలు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వారికి మద్దతు ఇచ్చి గెలిపించాలని బీసీ నేతలు ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు. పోటీపడే అభ్యర్థులందరూ బీసీలయితే ఏకాభిప్రాయంతో ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వాలని, అలా సాధ్యంకానిపక్షంలో తటస్థంగా ఉండటం మంచిదన్న ఆలోచనకూడా వారిలో ఉంది. ఆర్థికంగా స్థితి మంతులు, విద్యావంతులైన బీసీ యువతను రాజకీయా ల్లోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయా కులాల పెద్దలను కలిసి అన్ని బీసీ కుల, ఉద్యోగ, వృత్తి సంఘాలను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థికంగా కూడా తగిన స్థాయిలో తమ వర్గానికి చెందిన వ్యాపారులు, ఉద్యోగుల నుంచి నిధులు సేకరించడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ప్రతి జిల్లాలో భారీ స్థాయిలో బీసీ సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీల బలం నిరూపించే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు.
టీడీపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ అధికారంలోకి వచ్చాక తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీసీల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. పదిమందికి పైగా మంత్రిపదవులు ఇచ్చారు. అసెంబ్లీ స్పీకర్‌ కూడా బీసీనే. 56 కార్పొరేషన్లను బీసీలకు కట్టబెట్టారు. పలు కార్పొరేషన్ల డైరెక్టర్లుగా బీసీలకు పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీలుగా కూడా వైసీసీ బీసీలకు అవకాశంఇచ్చింది. రాజ్యసభ సభ్యులుగా బీసీలైన ఆర్‌.కృష్ణయ్య, పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌ రావు తదితరులను ఎంపిక చేశారు. బీసీలంటే మొదటగుర్తొచ్చేది కృష్ణయ్యే. అలాంటి కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం ద్వారా తామే నిజమైన బీసీపక్షపాతి అనిచెప్పే ప్రయత్నంచేసింది వైసీపీ. అయితే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడు కావడంతో ఉద్యమ ఊపు తగ్గింది.
సీనియర్‌ జర్నలిస్ట్‌ – 9440222914

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img