భారత దేశ జనాభాలో మహిళలు 48శాతం ఉన్నప్పటికీ, స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో మహిళల సహకారం 18శాతం కాగా, మొత్తం శ్రామిక శక్తిలో మహిళలు 2324శాతం మాత్రమేనని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా అధ్యయనం వెల్లడిరచింది. పురుషులతో సమానంగా దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళలను భాగస్వాములను చేయడం ద్వారా భారత్ 2025 స్థూల జాతీయోత్పత్తి 4.83 ట్రిలియన్లు సాధించవచ్చునని మెకిన్సే గ్లోబల్ అధ్యయనం పేర్కొంది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యానికి సంబంధించి భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద లింగ అంతరాలలో ఒకటిగా ఉందని తెలిపింది. కార్మిక భాగస్వామ్యం, ఆర్థిక సహకార రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని విస్తరించడం, లింగ సమానత్వాన్ని సాధించడం ప్రపంచవ్యాప్త సమస్యగా ఉందని పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లగార్డ్ మాట్లాడుతూ, పురుషులతో సమానంగా మహిళలు కూడా పని ప్రదేశాల్లో పాల్గొంటే భారతదేశ జీడీపీ 27శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. కనీసం 50శాతం మంది మహిళలు వర్క్ ఫోర్స్లో చేరగలిగితే భారతదేశం తన వృద్ధిని 1.5 శాతం పాయింట్ల నుండి 9 శాతానికి పెంచుకోవచ్చు. ఉపాధిలో లింగ వ్యత్యాసాన్ని తగ్గించడంవల్ల దేశ జీడీపీిలో మహిళల చేయూత 30శాతం పెరుగుదల సాధ్యమవుతుంది. 2023లో ఉపాధి కల్పనలో మహిళలు దాదాపు 53శాతం ఉన్నారు. ప్రపంచంలోని స్టార్టప్ల పరంగా భారతదేశం 3వ అతిపెద్ద పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. వాటిలో 10శాతం మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నివేదిక ప్రకారం, 65శాతం మంది మహిళలు సామాజిక, సాంస్కృతిక అవరోధాల కారణంగా బ్యాంకింగ్ రంగ లావాదేవీల్లో అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. పురుషులతో పోలిస్తే ఇది అధిక శాతం. 72శాతం మంది పురుషులు ఆర్థిక సంస్థలో ఖాతా కలిగి ఉన్నారు. లింగ వేతన వ్యత్యాసాల గణాంకాల ప్రకారం, మహిళలు సగటున వివిధ రంగాలలో పురుషుల కంటే తక్కువ సంపాదిస్తున్నారు. మహిళలు ప్రపంచ కార్మిక ఆదాయంలో కేవలం మూడిరట ఒక వంతు మాత్రమే ఉండగా, ప్రపంచవ్యాప్తంగా మహిళలు 15శాతం కంటే తక్కువ వ్యవసాయ భూమిని కలిగి ఉన్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పరిశ్రమలలో పనిచేసే 88శాతం మంది మహిళలు అనధికారిక రంగంలో పనిచేస్తున్నారు. అదనంగా, 7శాతం మంది మహిళలు సేవారంగంలో నిమగ్నమయ్యారు. భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన అంశం మహిళల ఆర్థిక భాగస్వామ్యాన్ని గుర్తించడం. 2.7 బిలియన్లకు పైగా మహిళలు పురుషులతో పోలిస్తే తమ ఉద్యోగ అవకాశాలను పరిమితంచేసే చట్టపరమైన పరిమితులను ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో లింగ-ఆధారిత చట్టపరమైన అసమానతలు మహిళలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పెరిగిన మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యం దేశ ఆర్థిక విస్తరణకు దారి తీస్తుంది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి ప్రధానంగా మహిళలు, బాలికలకు విద్య, ఆరోగ్యం, గౌరవప్రదమైన పని, రాజకీయ, ఆర్థిక, నిర్ణయాత్మక ప్రక్రియలలో ప్రాతినిధ్యం కల్పించడం అవసరం. నేషనల్ హౌసింగ్ బ్యాంక్కు చెందిన రంజన్ కుమార్ బరున్ మాట్లాడుతూ, ‘‘మహిళా సాధికారతకు నిజమైన అర్థం ఒక మహిళ తన నిర్ణయాలన్నింటినీ తనంతట తానుగా తీసుకోగలిగి ఉండాలని, వివక్షాపూరిత పద్ధతులను తొలగించాలని సూచించారు. తాజాగా గర్భధారణ వల్ల మహిళలకు ఉద్యోగాల్ని నిరాకరించడం సాధ్యం కాదని ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు చారిత్రకమైనది. ఈ నిర్ణయం శ్రామికశక్తిలో మహిళలకు సాధికారత కల్పించడంతోపాటు న్యాయమైన, సమాన అవకాశాలకు ఉదాహరణగా నిలుస్తుంది.లింగ అంతరాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి మూల కారణాలను పరిష్కరించడానికి క్రియాశీల ప్రయత్నాలు అవసరం. విద్యాపరమైన అంతరాలు, సామాజిక అసమానతలు, ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి, పిల్లల సంరక్షణ మహిళలు ప్రధాన సమస్యలు. ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం, ఆరోగ్య సంక్షణలో మహిళల స్థితిగతులను మెరుగుపరచడం ద్వారా దేశ ఆర్థికవ్యవస్థలో సమగ్ర వృద్ధిని సాధించగలం.
ఎడిట్ పేజీ డెస్క్