విశాలాంధ్ర జననీ
విప్లవ తరింగిణీ
లే తల్లి లే
చల్లని పిల్లల తల్లీ
అక్షరరూపంలో మా
కాత్మ శక్తి నివ్వమ్మా
అఖిలాంధ్రావనికి
ఆదేశాలీయమ్మ
ముక్కోటి తెలుగు బ్రతుకుల
చిక్కులు తొలగించెయ్
ఒక్కటిగా చేయితల్లీ
ఎండిన మా గుండెలలో
నవక్షీర ధారపిండి
పసిడి పంట పండిరచమ్మ
కసాయి తుపాకి నీడ
కనుమూసిన నా యోధుల
త్యాగకధలు చెప్పమ్మా
లోకం కళ్లు తెరిపించు తల్లీ
మా రక్తంలో రక్తంగా
గుండెల్లో గుండెగా
సమాజానికి శాంతిని
ద్రోహులకు ప్రాయశ్చిత్తాన్నీ
నిర్భీతిగా నిలిచిచెప్పు
నరరూపంలో మెసిలే
నక్కలకూ, తోడేళ్లకూ
చరిత్ర తీర్పు ప్రకటించమ్మ
నీవే మేము, మేమే నీవు
నిజం, నిర్భయం మనలక్ష్యం
సాగిరావమ్మా
స్వాగతమమ్మ
(2206
1952వ తేదీన విశాలాంధ్ర మొదటి సంచికలో ప్రచురితమైన గేయం)