విశాలాంధ్ర, పార్వతీపురం : జగనన్నకు చెబుదాంకు కార్యక్రమం ద్వారా వచ్చిన 100 అర్జీలను పరిశీలించి త్వరిత గతిన పరిష్కారం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్, జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబితలు కోరారు.సోమవారం వారితో పాటు ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవ నాయుడు,ఎల్విన్ పేట ఎస్.డి. సి( ట్రైబల్ వెల్ఫేర్) ఆర్. వి. సూర్యనారాయణలు కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి బి. జగన్నాధం, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా బిసి సంక్షేమ సాధికారిత అధికారి ఎస్.కృష్ణ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పి. డి. కె రామచంద్ర రావు , గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి జె శాంతీశ్వర రావు, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి డా కొయ్యాన అప్పారావు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.