విశాలాంధ్ర – సీతానగరం : మండలంలోని జోగింపేట గ్రామానికి చెందిన బొమ్మినాయుని లక్ష్మణరావు, గంగమ్మల పెద్దకుమారుడు బొమ్మినాయుని ప్రశాంత్ ఐఐఎం తిరుచునాపల్లిలోగురువారం జాయిన్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త లక్ష్మణరావు, తెలుగుదేశంపార్టీ మహిళ నాయకురాలు గంగమ్మలు ఎంతోకష్టపడి వారిద్దరి పిల్లలు మనోహర్, ప్రశాంత్ లను చదివించారు. వారిద్దరిలో ఒకరు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని పాఠశాలలో చదివారు. నేడు పెద్దబ్బాయి ఐఐఎంలో చేరడం ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు.ఉన్నత విద్యాభ్యాసం చేయడంలో తల్లిదండ్రులతోపాటు పెదనాన్న బొమ్మినాయుని వెంకటరమణ సహకారం మరువలేనిదని ప్రశాంత్ తెలిపారు. లక్ష్మణరావు,గంగమ్మల కుమారుడు ప్రశాంత్ ఉన్నత చదువుల్లో చేరడంపట్ల పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర, బొబ్బిలి ఎంఎల్ఏ బేబీ నాయనలతో పాటు మండల టిడిపి నాయకులు అభినందించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబానికి చెందిన పిల్లలు ఉన్నతస్థాయికి చేరడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.