విశాలాంధ్ర,సీతానగరం: నవోదయ రెండో జాబితాను బుదవారం ప్రకటించగా మండలంలోని గెడ్డలుప్పి కూడలిలో ఉన్న కృషివిద్యానికేతన్ కు చెందిన 6వతరగతి విద్యార్థి మరడ జస్వంత్ కుమార్ (వెంకటబైరిపురం ) ఎంపికయినట్లు కరస్పాండెంట్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు తెలిపారు.ఇప్పటికే ఈఏడాదిలో ఈపాఠశాలకు చెందిన గవర ఎతీశాచంద్ర (బగ్గందొరవలస) లబ్బ చరిష్మా (బగ్గందొర వలస)విద్యార్థులు నవోదయలో 6వ తరగతిలో సీట్లు సాధించి చేరారని ఆయన తెలిపారు.2024 నవోదయలో తమ పాఠశాల నుండి మూడుసీట్లు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.దీనికి కారకులైన ఉపాద్యాయ సిబ్బందికి, సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలాఉండగా మొదటి జాబితాలో రెండుసీట్లు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు గోవిందరావు, మురళిలు పాఠశాల విద్యార్థులకు,ఉపాధ్యాయులకు స్వీట్లు పంపిణీ చేయడంతోపాటు పాఠశాల అభివృద్ధికి వారిద్దరూ ఇరవైవేల నగదును అందించినట్లు కరస్పాండెంట్ శ్రీనివాసరావు తెలిపారు