విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని 16వ వార్డులో చేనేత వృత్తినే నమ్ముకున్న పోలా శ్రీనివాసులు కుటుంబ పరిస్థితి దారుణంగా ఉండడం, నేసిన చీరకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కుటుంబ పోషణ భారం అధికమయింది. సమాచారం అందుకున్న 16వ వార్డ్ కౌన్సిలర్ కేతా లోకేష్ వారి ఇంటికి వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ పోషణ కొరకు పిల్లల చదువుల ఫీజుల కొరకు తన వంతుగా 13 వేల రూపాయలు నేరుగా చెల్లించారు. చేనేత కార్మికుడు పోలా శ్రీనివాసులు మాట్లాడుతూ మాలాంటి పేదవారికి కౌన్సిలర్ ఇలా సహాయం చేయడం మరుపురాని విషయము అని తెలుపుతూ కృతజ్ఞతలను తెలియజేశారు. పోలా శ్రీనివాసులు కొడుకు పూల అవినాష్ కు ఆ 13 వేల రూపాయలు ఫీజుగా చెల్లించాలని తెలిపారు. మున్ముందు కూడా నా అన్నదండలు మీకు ఉంటాయని కౌన్సిలర్ తెలిపారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి కౌన్సిలర్కి కృతజ్ఞతలు తెలియజేశారు.