జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఏపీ చేతివృత్తుల దారుల సమాఖ్య
విశాలాంధ్ర- అనంతపురం : ఆంధ్ర ప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామాంజనేయులు, రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో మద్యం పాలసీలో కల్లుగీత కుల సామాజిక వర్గానికి 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో కల్లుగీత కుల సామాజిక వర్గానికి 10% షాపులు రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. కల్లుగీత సామాజిక వర్గంలో కల్లుగీత కార్మికులుగా అనేకమంది ఆవృత్తిని వదిలిపెట్టి ఇతర వ్యాపారాలు, వ్యాపకాలు చేసుకొని ఆర్థికంగా స్థిరపడ్డారన్నారు. దీనివల్ల ఈ రిజర్వేషన్లు అమలులో కేవలం డబ్బున్న వారికి మాత్రమే 10 శాతం షాపులు ఇవ్వడం వల్ల అనేక సంవత్సరాలుగా తరతరాలుగా కల్లుగీత కార్మికుని గా వృత్తిని చేసుకుంటున్న వారికి అన్యాయం జరుగుతుంది అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దయచేసి మద్యం షాపులలో కల్లుగీత సొసైటీలకు మాత్రమే 10% శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చేసి కల్లుగీత కార్మికులకు న్యాయం చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు మేకలు పెంపకదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కె పోతులయ్య చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సివిహరి కృష్ణ జిల్లా ఉపాధ్యక్షుడు సి నాగప్ప నగర అధ్యక్షులు గోవిందరాజులు నగర కార్యదర్శి వీరాంజి నగర గౌరవ అధ్యక్షురాలు ఈశ్వరమ్మ,గొర్లు మేకల పెంపకార్ల సంఘం జిల్లా నాయకులు బండి వెంకట రాముడు, తదితరులు పాల్గొన్నారు.